నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:11

Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్‌

అమరావతి: జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు..

ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ''జైలు మోహన్‌కు బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్.. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.

రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులు ఉన్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు'' అని లోకేశ్‌ ధ్వజమెత్తారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:08

Chandrababu : క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన చంద్రబాబు

దిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు..

తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.

సోమవారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది.

దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 15:06

స్కాంలో ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి బొత్స

చంద్రబాబుపై మంత్రి బొత్స సెటైర్లు

అవినీతిపై పక్కా ఆధారాలున్నాయి

బాబు మద్దతిచ్చే వారు ఇప్పటికైనా ఆయన్ను ప్రశ్నించండి

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైరికల్‌ పంచ్‌ వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ..

దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు.

అలాగే, స్కిల్‌ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.

స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్‌ సీఎం దగ్గరకు వెళ్తుంది.

దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. రిమాండ్‌ కొనసాగింపు సందర్బంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు.

అందుకే ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలి..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:31

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు సార్లు గ్రూప్ - 1 పరీక్షలు రద్దు అయినట్లు తెలిసింది.

హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ - 1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం… పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

జూన్ 11వ తేదీన జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది...

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:28

చంద్రబాబును విచారిస్తున్న సిఐడి బృందం

సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది.

అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు.

సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.

ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు విచార‌ణ‌లో షరతులు

చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని ఆదేశించిన కోర్ట్ .

ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం

విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతి.

9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లను అనుమతి

ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం.

కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు.

విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు.

న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి..

విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు

విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం అందుబాటులో ఉంచాలి.

మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం

ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్.

విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉండడానికి అనుమతి

బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు.

న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.

విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం.

దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని సమర్పించాలని ఆదేశించిన కోర్ట్

సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ.

రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 13:25

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో నేడు జమిలి కమిటీ సమావేశం

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది.

ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది.

ఈ నెల 23న కమిటీ సమావేశం జరుగుతుందని కోవిద్ ఇటీవల ఒడిశాలో చెప్పిన విషయం తెలిసిందే.

లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి, వీలయినంత త్వర లో సిఫార్సులు చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న కోవింద్ నే తృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే,

ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్‌కె సింగ్ , లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ చీఫ్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

లోక్‌సభలో కాం గ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని కూడా కమిటీలో సభ్యుడుగా ఉన్నప్పటికీ తాను కమిటీలో ఉండబోవడం లేదని ఆయన ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కాగా ఈ సమావేశం కే వలం పరిచయ సమావేశం మాత్రమేనని, ఈ సమావేశంలో తమకిచ్చి న అంశంపై ముందుకు వెళ్లడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌పై కమిటీ చరిస్తుందని కమిటీ సన్నిహిత వర్గాలు తెలియజేశారు.

కమిటీ విధి విధానాల గురించి న్యాయశాఖ అధికారులు ఇదివరకే కోవింద్‌కు వివరించారు. అంతేకాకుండా అమిత్ షా, కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌లు కోవింద్‌ను కలిశారు.

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 10:32

600 కోట్ల వజ్ర గణపతిని చూశారా.?

గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు.

182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి,

ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.

ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు.

మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.

15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 10:25

చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి..

టీడీపీ అధినేత చంద్రబాబును ఈరోజు, రేపు సీఐడీ అధికారులు విచారించనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే..

ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాలును అధికారులు సిద్ధం చేశారు.

చంద్రబాబును తొమ్మిది మంది సీఐడీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతిస్తారు.

సీఐడీ విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. కాసేపట్లో చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.

ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభమవుతుంది.

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సీఐడీ అధికారులు బస చేశారు. కాసేపటి క్రితమే వారు గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు బయల్దేరారు..

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:46

Shamshabad: శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు 300 మంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది.

దీంతో రాష్ట్రంలో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.

శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఖతార్‌ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్‌ ఎందుకు చేస్తున్నారో అర్థంకాని గందరగోళ పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది.

దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికుల మైండ్‌ బ్లాంక్ అయ్యింది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 23 2023, 09:43

నేటి నుంచి ఆసియా గేమ్స్ సమరం

ఆసియా గేమ్స్‌-2023 ప్రధాన ఈవెంట్లకు నేటి నుంచి తెరలేవనుంది. ఈ మెగా సంగ్రామంలో భారత క్రీడాకారులు పతకాల వేటను ప్రారంభించడానికి రెడీ అయ్యారు.

భారత్‌ నుంచి వివిధ క్రీడాంశాల్లో మొత్తం 655 మంది క్రీడాకారులు ఈ మెగా సమరంలో పోటీ పడుతున్నారు. గత ఎడిషన్‌ 2018లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌ పోటీల్లో భారత్‌ మొత్తం 70 పతకాలు గెలుచుకుంది.

ఇదే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక ఈసారి చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మన దేశ ఆటగాళ్లు వంద(100) పతకలతో సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, మహిళల క్రికెట్‌, టేబుల్‌ టెన్నిస్‌, రోయింగ్స్‌ వంటి క్రీడలు మొదలయ్యాయి. కానీ అధికారికంగా శనివారం నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఈ మెగా టోర్నీ ప్రధాన ఈవెంట్లు జరుగుతాయి.

బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, పురుషుల క్రికెట్‌, టెన్నిస్‌, హాకీ, కబడ్డీ, రెజ్లింగ్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, సెపక్‌ తక్రా తదితర క్రీడా అంశాల్లో భారత ఆటగాళ్లు పతకాల కోసం విదేశీ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు.

ప్రస్తుతం అన్ని క్రీడా విభాగాల్లో భారత్‌ దూసుకుపోతుంది. చిన్న చిన్న పోటీల్లో కాకుండా పెద్ద ఈవెంట్‌లలోనూ భారత క్రీడాకారులు సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌లలోనూ పతకాలు సాధిస్తూ భారత ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికల్లో దేశ కీర్తి, ప్రతిష్టలను మరింతగా మెరుగుపరుస్తున్నారు.

ఈసారి అత్యధిక స్వర్ణాలు ఖాయం..!

కొన్ని క్రీడాంశాల్లో భారత్‌ స్వర్ణ పతకాలు గెలవడం ఖాయం. ముఖ్యంగా భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈసారి బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.

ఈ ఏడాది జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడిషన్‌ ఆసియా గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించన విషయం తెలిసిందే.

ఈసారి కూడా అతను పసిడితో మెరుస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇక తొలిసారి ఆసియా క్రీడాల్లో ప్రవేశ పెట్టిన క్రికెట్‌లో కూడా భారత్‌ పురుషుల, మహిళల రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు హాకీలోనూ టీమిండియా పటిష్టంగా ఉంది.

హాకీలో పురుషుల జట్టు, మహిళల జట్టు పసిడి గెలుచుకుంటుందనడంలో సందేహంలేదు. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు ఎదురులేదనే చెప్పాలి. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి పురుషుల డబుల్స్‌ జోడీ ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే మహిళల సింగిల్స్‌లో సింధుపై భారీ ఆశలు ఉన్నాయి.

ఈ ఏడాది ఫామ్‌లేమితో సతమతమవుతున్న సింధు ఆసియాగేమ్స్‌ పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబీ శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌లు కూడా పతకాలు గెలుచుకోనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.